ఎమ్మెల్యేపై కక్షతో పెంపుడు కుక్కలకు విషం..

ఎమ్మెల్యేపై కక్షతో పెంపుడు కుక్కలకు విషం..

ఎమ్మెల్యేపై ఉన్న కోపాన్ని,కక్షను ప్రత్యర్థులు ఎమ్మెల్యే పెంపుడు కుక్కలపై చూపారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుక్కులకు విషం పెట్టి హతమార్చారు.తమిళనాడులోని సేలం జిల్లా వీరపాండి ఎమ్మెల్యే మనోన్మణి పనమరత్తుపట్టి యూనియన్పారపట్టిలో ఉంటున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చారు. తాము పెంచుకుంటోన్న మూడు పెంపుడు శునకాలు మృతిచెంది ఉండడం చూసి షాకయ్యారు.వాటికి విషమిచ్చి వాటిని చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.  ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు పనమరత్తుపట్టి యూనియన్కౌన్సిలర్పదవికి పోటీ చేశారు. నేపథ్యంలో ప్రత్యర్థులు ఆయనను బెదిరించడానికే ఘటనకు పాల్పడ్డారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos