ఆసక్తిగా కర్నూలు రాజకీయాలు…

ఆసక్తిగా కర్నూలు రాజకీయాలు…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అలనాటి రాజధాని కర్నూలు జిల్లాకు
కూడా ప్రత్యేక స్థానం ఉంది.అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన కర్నూలు జిల్లాలో రెండు లోక్‌సభ
స్థానాలు ఉండగా 14 శాసనసభ స్థానాలు ఉన్నాయి.దీంతో కర్నూలు జిల్లాలో గెలుపు కోసం ప్రధాన
పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి సారియిస్తాయి.ఇక కర్నూలు జిల్లా రాజకీయాల్లో శిల్ప కుటుంబానికి
ప్రత్యేక గుర్తింపు ఉంది.నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో దిగిన శిల్ప మోహన్‌రెడ్డి
హోరాహోరీగా పోరాడి ఓటమి చెందారు.త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికలకు శిల్ప కుటుంబం సన్నద్ధమవుతోంది.శిల్ప
మోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవి నంద్యాల శాసనసభ స్థానం ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా
తమ్ముడు శిల్ప చక్రపాణి శ్రీశైలం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్నారు.తన కుమారుడు,తమ్ముడు
శాసనసభ ఎన్నికల్లో పోటీ పడుఉతుండడంతో నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయడానికి శిల్ప మోహన్‌రెడ్డి
ఆసక్తి కనమబరుస్తున్నారు.మరోవైపు బిజ్జం పార్థసారధిరెడ్డి కూడా వైసీపీ నుంచి నంద్యాల
నుంచి ఎంపీ ఎన్నికల బరిలో దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ ఇద్దరిని కాదని
కర్నూలు బీజేపీ నేత పోచా బ్రహ్మానందరెడ్డికి ఎంపీ టికెట్‌ ఇవ్వడానికి వైసీపీ అధినేత
జగన్‌ ఆసక్తి చూపుతున్నట్లు.త్వరలోనే బ్రహ్మానందరెడ్డి వైసీపీలోకి చేరుతున్నట్లు జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.సీడ్స్ బిజినెస్ రంగంలో రాణిస్తున్న బ్రహ్మానందరెడ్డి బీజేపీలో ఉండగా ఆయన బంధువర్గం టీడీపీలో కొనసాగుతోంది. ఫైనాన్సియల్ గా ఫిట్ గా ఉన్న బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై శిల్పా మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. తన తమ్ముడికి – కుమారుడికి అసెంబ్లీ టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో ఆయన సర్దుకుపోతారా..? లేక భగ్గుమంటారా..? అన్న చర్చ నడుస్తోంది. అయితే శిల్పా ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలో దిగుతున్న సమయంలో ఆర్థికంగా బలంగా ఉన్న బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దించుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఒకే పార్టీ నుంచి ఇద్దరి బంధువులకు టిక్కెట్లు ఇస్తున్న సమయంలో మూడో టికెట్ పై ఎలాంటి అభ్యంతరం చెప్పరని అనుకుంటున్నారట. మరోవైపు శిల్పా అంగీకారంతోనే బ్రహ్మానందరెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బిజ్జం పార్థసారధిరెడ్డి ఏం చేస్తారన్న చర్చ బయటకు వచ్చింది. ఒకవేళ వైసీపీ నుంచి టికెట్ రాకపోతే సైకిల్ ఎక్కుతారని కూడా అంటున్నారు. పాన్యం మాజీ ఎమ్మెల్యే అయిన బిజ్జం ఈసారి నంద్యాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగుతోంది. అయితే పార్టీ ఏదని త్వరలో నిర్ణయమవుతుందని అంటున్నారు. బ్రహ్మానందరెడ్డి బీజేపీ నుంచి వైసీపీలోకి వస్తే బిజ్జం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లేనంటున్నారు. ఇలా ఎన్నికల వేళ నేతల కప్పుదాట్లు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos