అమరావతి: ‘అభివృద్ధిని అడ్డుకుంటూ, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన శాసన మండలిని రద్దు చేయాలన్న ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినంది స్తున్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ మంత్రి పదవులను వదిలేసుకునేందుకు సిద్ధమేన’ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ మంగళ వారం ఇక్క డ విలే ఖ రుల సమావేశంలో పేర్కొన్నారు.‘మండలి సభ్యులుగా ఉండటం ఆవేదన కలిగిస్తోంది. గతంలో ఎన్టీ రామారావు ముఖ్య మంత్రి గా ఉన్నపుడు స్వల్ప ప్రయోజనాల కోసం రామోజీరావు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి, మండలిని రద్దు చేశారు. ఇప్పుడు విస్తృత ప్రయోజనాల కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరికీ నచ్చిన చోట రాజధాని పెట్టాలని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పగా, ఆ మాటను పట్టించుకోలేదు. చంద్రబాబు తప్పుడు నిర్ణయాలను సరిదిద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నార’ని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.‘ మండలి సభ్యులైన మేము పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. పెద్దల పేరు చెప్పుకుని అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే ఇటువంటి సభ ఉండటానికి వీల్లేదని, జగన్ తీసు కున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు చేస్తున్న పనుల వల్ల చట్ట సభల సభ్యులు ప్రజల ముందు తల దించుకుని నిల బడాల్సి వస్తోంది. మా పార్టీ నుంచి గుర్తింపు పొందిన వ్యక్తులు మండలిలో ఉండగా, చంద్రబాబు మాత్రం దోపిడీదారులను మండ లికి పంపార’ని మోపిదేవి విమర్శించారు.