న్యూ ఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్న్యూస్. సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియాను ఈపీఎఫ్ఓ భారీగా పెంచింది. పి.ఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ రూ. 8.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆగస్టు 19న సర్క్యులర్ జారీ చేసింది.