తిరుమల : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల వేంకట్శ్వేరుడి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయడానికి.. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది.