న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్లను నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేసింది. గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయక పోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని హెచ్చరించింది సుప్రీంకోర్టు. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్రం సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా ఎలాంటి యంత్రాంగాన్నీ ఏర్పాటు చేస్తుందో చూద్దామని సుప్రీంకోర్టు మందలించింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ఎండార్స్ చేయకుండా నిషేధం విధించేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు కేఏ పాల్. బెట్టింగ్ యాప్లతో ఎంతోమంది యువకులు నష్ట పోతున్నారని సుప్రీం కోర్టు దృష్టికి కేఏ పాల్ తీసుకువచ్చారు.