న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనది కావటంతో దాన్ని కూల్చేయదలచినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ‘ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనం. భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టం. ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తాం. 1921 లో ఈ భవన నిర్మాణం ప్రారంభమై 1937 లో ముగిసింది. ఇప్పటికే ఇందులో చాలా సమావేశాలు జరిగాయి. ప్రస్తుత అవసరాలకు, సాంకేతికతకు ఈ భవనం సరిపోద’ ని అందులో పేర్కొంది.