ఢిల్లీ : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది. వైమానిక దళ సభ్యులకు (చీఉుAవీ) నోటీసు జారీ చేసింది. ఈ నోటామ్ కింద, ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అన్ని పాకిస్తాన్-రిజిస్టర్డ్, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానాన్ని భారత గగనతలంలోకి అనుమతించరు. నిర్ణయం పాక్ ఎయిర్లైన్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పాకిస్థాన్ విమానాలు సింగపూర్, థారులాండ్, మలేసియా తదితర దేశాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే.