ఇద్దరే సంతానం చట్టానికి మద్దతు ఇవ్వం

ఇద్దరే సంతానం చట్టానికి మద్దతు ఇవ్వం

హైదరాబాదు: ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదని నియంత్రించే ఏ చట్టాన్నయినా తాను సమర్థించనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ‘‘చైనా చేసిన తప్పిదాన్ని మనం పునరావృతం చేయకూడదు. ఇద్దరు పిల్లలకు మించి కలిగి ఉండరాదన్న చట్టానికి నేను మద్దతు పలకను. ఎందుకంటే అది దేశానికి మంచిది కాదు. దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 2030 నాటికి ఇది స్థిరపడుతుంది. కనుక చైనా చేసిన తప్పును ఇక్కడ మనం కూడా చేయరాదు’’ అని ఓవైసీ గురువారం ఓ వార్తా సంస్థ ముఖాముఖిలో పేర్కొన్నారు. దేశంలో ముస్లింలే ఎక్కువగా సంతాన నిరోధక సాధనాలను వాడుతున్నట్టు ఓవైసీ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. జనాభా విషయంలో ముస్లింలనే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారంటూ ఆయన లోగడ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ‘‘ముస్లింలు భారతీయులు కారా? వాస్తవానికి గిరిజనులు, ద్రవిడులే ఇక్కడి వార’నీ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos