న్యూ ఢిల్లీ : బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహించింది. అధికారం ఉందనే పొగరు తలకెక్కి నూపుర్ శర్మ ఇష్ట మొచ్చినట్లు మాట్లా డారని శుక్రవారం మండి పడింది. తనకు ఉన్న ప్రాణహాని, అత్యాచార బెదిరింపులు ఉన్నందున దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపినపుడు ఆమెపై సుప్రీం కోర్టు మండి పడింది. ‘‘ఆమె నోటి దురుసు.. దేశం మొత్తంలో మంటపెట్టింది. రావణ కాష్టాన్ని రగిల్చింది. నూపుర్ శర్మ వ్యాఖ్యల వల్లే ఉదయ్పూర్ ఘటన కూడా జరిగింది. ఆమె యావత్ దేశానికి క్షమా పణలు చెప్పాల్సిందే’ నని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప టీవీ ఛానెల్, నూపుర్ శర్మల చర్చ వల్ల ఒరిగింది ఏమిటి? అని సూటిగా ప్రశ్నించింది. దీనికి ఆమె తరపున సీనియర్ అడ్వొకేట్ మణిందర్ సింగ్ సమాధానమిస్తూ.. ప్రవక్త వ్యాఖ్యలపై ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అయితే.. ఆమె టీవీ ద్వారా నే వచ్చి యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉంది, కానీ, అప్పటికే ఆలస్యం అయ్యిందని సుప్రీం తెలి పింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్ శర్మ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో చెప్పగా.. జస్టిస్ సూర్యకాంత్ కలగజేసుకుని.. ఆమెకు ముప్పు ఏర్పడిందా? ఆమె వల్ల దేశం రగిలిపోతోంది అంటూ మండి పడ్డారు. దేశమంతటా భావోద్వేగాలను ఆమె రగిలించిన విధానం, దేశంలో జరుగుతున్న ఘటనలకు ఆమెదే బాధ్యత అన్నారు. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ఆమె ఫిర్యాదు మీద ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి ఆమెపై ఎన్నో ఎఫ్ఐఆర్లు అందినా ఎందుకు ఆమెను వదలి పెట్టారని ఢిల్లీ పోలీసులను ధర్మాసనం నిలదీసింది. ఆమె అహంకారంతో మాట్లాడింది. మీలాంటి వ్యక్తులకు ఏ మతం మీద గౌరవం లేదని.. ఆ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. నోటి దురుసుతనంతో అధికారం ఉందనే తలపొగరుతో ఆమె చేసిన వ్యాఖ్యలు దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టాయి. ఆమెది సరిదిద్దుకోలేని పొరపాటని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశ భద్రతకు ముప్పు తెచ్చింది నూపుర్ శర్మనేనని వ్యాఖ్యానించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని నూపుర్ శర్మ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.