25 ఏళ్ల తరువాత ముస్లిం లీగ్‌ నుంచి మహిళా అభ్యర్థి

తిరువనంతపురం: కోజికోడ్ దక్షిణ విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నూర్బినా రషీద్ అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. యూడీఎఫ్ భాగ స్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్ ) తరఫున గత 25 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్న మహిళగా నిలిచారు. చివరగా 1996లో ఐయూఎంఎల్ తరఫున ఖామరున్నీసా పోటీ చేశారు. ‘ 25ఏళ్ల తరువాత ఈ సారి పార్టీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని నేను ఆశించాను. పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల్లో గెలిస్తే కేరళలో మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తాను. సమాజానికి సేవ చేస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాన’ని నూర్బినా రషీద్ తెలిపారు. అసెంబ్లీలోకి మరింత మంది మహిళలు రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు నూర్బినా తెలిపారు. మహిళల సమస్యలు, అణగారిన వర్గాల బాధలను మహిళలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలరని ప్రజలు భావిస్తున్నారని వివరించారు.ఐయూఎంఎల్ ఈ సారి 27 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.కేరళలోని మొత్తం 140 స్థానాల్లో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos