కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం..

కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం..

పాలనలో సంచలన సంస్కరణలు తీసుకువచ్చి మరే రాష్ట్రంలో లేని విధంగా పాలనలో తనదైన ముద్ర వేయడానికి పట్టుదలతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందులో మొదటి అడుగును వేశారు.ఇప్పటివరకూ జిల్లా స్థాయి లో రెవెన్యూ చట్టం అమలు.. భూ వ్యవహారాల్ని పర్యవేక్షించే జేసీల (జాయింట్ కలెక్టర్) పోస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.వారి స్థానంలో అదనపు కలెక్టర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారుతెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలకు జేసీలుగా ఉన్న వారిని అదనపు కలెక్టర్లుగా వారిని బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త వారిని నియమించగా.. 14 జిల్లాలకు వేరే అధికారుల్ని అదనపు కలెక్టర్లు గా నియమిస్తూ జీవో జారీ చేసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది నాన్ కేడర్.. కేడర్ అధికారుల్ని బదిలీ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ కీలక జీవోను జారీ చేయటం గమనార్హం.పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతో పాటు..అకస్మిక తనిఖీలు.. నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులు.. సిబ్బంది పై చర్యలు తీసుకునే అధికారాల్ని వీరికి అప్పజెప్పనున్నారు. లే అవుట్ల అనుమతులు.. ప్రాపర్టీ అసెస్ మెంట్స్ తదితర పనులు వీరికి అప్పగించనున్నారు. మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లు.. గ్రామ పంచాయితీలు.. పారిశుధ్యం.. పచ్చదనం.. ఇతర మౌలిక సదుపాయాల కల్పన.. నర్సరీ ఏర్పాటు సర్టిఫికెట్ల జారీ లాంటి వాటి అంశాల్ని వీరే పర్యవేక్షించనున్నారు. నెల 11 జిల్లా కలెక్టర్ల ను సదస్సును సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు. సందర్భంగా కలెక్టర్లు.. అడిషనల్ కలెక్టర్లు.. అదనపు కలెక్టర్ల పోస్టులు.. విధులు.. బాధ్యతలు.. జాబ్ చార్ట్ పైన స్పష్టత ఇవ్వటం తో పాటు.. ఎలా పని చేయాలన్న సూచనల్ని చేయనున్నట్లు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos