ఏపీలో కొత్త కేసులు

ఏపీలో కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 534కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 14 మంది మృతి చెందగా, 20 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos