భారతి రెడ్డితో నమ్రత భేటీ

భారతి రెడ్డితో నమ్రత భేటీ

విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిని నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా బుర్రిపాలెం గ్రామ అభివృద్ధి పనులపై నమత్ర చర్చించారు. హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామమ్ ఫౌండేషన్ ద్వారా బుర్రిపాలెంలో మహేష్ బాబు అభివృద్ధి పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్ ద్వారా గ్రామాభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నమత్ర ఈ సందర్భంగా తెలిపారు. అంతకు ముందు నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ ఈవో నమ్రతకు అమ్మవారి చిత్ర పటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos