న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు అవరోధం ఏర్పడింది. బుధవారం దీని విచారణకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మొగ్గు చూపలేదు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ విచారణ మరో బెంచ్కు బదలీ అయ్యే అవకాశముంది. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జంట్గా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు. రేపు, ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.