టీకా పత్రం నుంచి మోదీ చిత్రం తొలగింపు

టీకా పత్రం నుంచి మోదీ చిత్రం తొలగింపు

చండీఘడ్ : కొవిడ్-19 టీకా పత్రం నుంచి ప్రధాని మోదీ చిత్రాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.18-44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా డిజిటల్ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో మోదీ ఫొటోను పంజాబ్ తీసివేసింది. గతంలో జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుంచి మోదీ చిత్రాన్ని తొలగించాయి. పంజాబ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. టీకాలు తీసుకున్న వారికి కేంద్రం విడుదల చేసిన కోవిన్ యాప్ బదులు పంజాబ్ కోవా యాప్ లో మోదీ చిత్రం లేకుండా పత్రాల్ని జారీ చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చిత్రాన్ని కూడా పత్రాల్లో చేర్చ లేదు. ఎవరి చిత్రాలు లేకుండా కేవలం తాము టీకా పత్రాల్ని మాత్రమే జారీ చేస్తున్నామని అధికారలు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే టీకాల కోసం రూ.1,000 కోట్లు వ్యయం చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos