న్యూఢిల్లి : రష్యా ఒరెన్బర్గ్లో సెప్టెంబర్ 16 నుంచి 21 వరకూ జరగనున్న సైనిక కవాతులో భారత్, పాక్లూ పాల్గొననున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) లోని చైనా తదితర దేశాలూ పాల్గొంటున్నాయి. పాక్, భారత్ల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నా వాటిని పట్టించుకోవటం లేదు. ఎస్సిఒ సభ్య దేశాల మధ్య సహకారం పెంపొందించడమే ఈ కవాతు ఆశయం.