50మంది మహిళలపై సైకో అత్యాచారం

  • In Crime
  • December 16, 2018
  • 231 Views
50మంది మహిళలపై సైకో అత్యాచారం

సాక్షి, చెన్నై: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న ఉన్మాది అరివలగన్‌ను అంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను బెదిరించి అత్యాచారం చేస్తూ, ఆ దృష్యాలను తన సెల్‌ ఫోన్‌లో అరివలగన్‌ రికార్డు చేసేవాడు. ఆ వీడియోలతో మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వాళ్లపై లైంగిక అకృత్యాలకు పాల్పడేవాడు. నేరస్తుడి సెల్‌ ఫోన్‌లో సుమారు 50 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. కొద్దిరోజుల క్రితమే ఓ గృహిణి, ముగ్గురు ఐటీ ఉద్యోగినులు ఫిర్యాదు చేయడంతో ఈ దుర్మార్గుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఉన్మాది అరివలగన్‌ కోసం ప్రత్యేకంగా గాలింపులు నిర్వహించిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos