మహిషాసురుడిగా మోదీ.. దుర్గాదేవిగా మమతా బెనర్జీ

మహిషాసురుడిగా మోదీ.. దుర్గాదేవిగా మమతా బెనర్జీ

మదనాపూర్ ;మహిషాసురుడిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన్ను సంహరించే దుర్గాదేవిగా మమత బెనర్జీతో ఉన్న పోస్టర్ వైరల్ అవుతోంది. ఆ పోస్టర్ వివాదానికి కేంద్ర బిందువైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ పార్టీ చెందిన అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్ లో మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానూ మహిషాసురుడిగా చూపించారు. ఇతర పార్టీలను మేకలుగా చూపిస్తూ బలి పశువులుగా పేర్కొన్నారు. ఎవరైనా వారికి ఓటేస్తే.. వారి ని బలిస్తామంటూ కింద నోట్ కూడా పెట్టారు. దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి తీవ్ర అవమా నమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆ పోస్టర్ ఎలా వచ్చిందన్న విషయం తనకు తెలియదని అనిమా సాహా చెప్పారు. అలాంటి పోస్టర్లను పెట్టనివ్వనని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos