మహేశ్ బాబు మైనపు విగ్రహం భారత్‌కు…

మహేశ్ బాబు మైనపు విగ్రహం భారత్‌కు…

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేశ్‌ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని త్వరలో హైదరాబాద్‌కు తరలించనున్నారట. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల కోసం మహేశ్‌ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విగ్రహం హైదరాబాద్‌లో కేవలం ఒక్క రోజే ఉంటుంది. మహేశ్‌కు చెందిన ఏఎంబీ థియేటర్‌లో ఈ విగ్రహాన్ని ఉంచుతారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో విగ్రహాన్ని ఇక్కడి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయట. ఒక్క రోజు ప్రదర్శన అనంతరం విగ్రహాన్ని మళ్లీ సింగపూర్‌కు తరలించి అక్కడి నుంచి లండన్‌లోని టుస్సాడ్స్‌ హెడ్‌క్వార్టర్స్‌కు పంపిస్తారు. ఈ విషయమై మహేశ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహేశ్‌తో పాటు యంగ్ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని కూడా టుస్సాడ్స్‌ సంస్థ బ్యాంకాక్‌ బ్రాంచ్‌లో రూపొందించింది. ప్రస్తుతం మహేశ్‌ ‘మహర్షి’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తైంది. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos