సినీనటి,బీజేపీ మహిళనేత మాధవిలత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులను కోరుతూ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడం, ఆ వెంటనే నిధులను మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ వ్యాఖ్యానించడంతో తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ, “మార్పు మొదలైంది. మోడీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయింది.. అయ్యబాబోయి, మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు, నిన్న జనగణమన పాడేరు. నేడు గుడులు బాగుచేయాలంటున్నారు. మోడీ, నువ్వు సామాన్యుడివి కాదయ్యా హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కోరారు” అని అన్నారు.
మార్పు మొదలైంది మోడీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే నిరూపితమయింది..అయ్యబాబోయి,మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు,నిన్న జనగన మన…
Posted by Actress Maadhavi on Sunday, February 9, 2020