ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి లాభాలతో ఆరంభమైన మార్కెట్లు చివరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాకుల్లో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం ఇందుకు కారణం. సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 48,093 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 14,137 వద్ద ఆగాయి. బిఎస్ఈ సెన్సెక్స్ లో భారతి ఎయిర్ టెల్ (3.75%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.22%), యాక్సిస్ బ్యాంక్ (2.48%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.31%), ఎల్ అండ్ టీ (1.92%) లాభాల్ని గడించాయి. టైటాన్ కంపెనీ (-2.03%), నెస్లే ఇండియా (-2.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.97%), ఇన్ఫోసిస్ (-1.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.38%) నష్ట పోయాయి.