ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు కాస్త ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే నిఫ్టీ 23,350 పైన ట్రేడింగ్ మొదలుపెట్టగా.. సెన్సెక్స్ ఫ్లాట్గా ప్రారంభమైంది. తొలుత సూచీలు ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ.. ప్రధాన షేర్లలో మదుపర్లు విక్రయాలకు దిగడంతో నష్టాల్లోకి జారుకున్నాయి.