కర్తార్‌పూర్‌ యాత్రికులకు పాస్‌ పోర్టు ఉండాల్సిందే

కర్తార్‌పూర్‌ యాత్రికులకు పాస్‌ పోర్టు ఉండాల్సిందే

ఇస్లామా బాద్: కర్తార్పూర్కు వచ్చే భారత యాత్రికులకు పాస్పోర్టు తప్పనిసరి అని పాకిస్థాన్ స్పష్టీకరించింది. కర్తార్ పూర్ మార్గంలో గురు ద్వార దర్బార్ సాహిబ్ను దర్శించుకునే భారత సిక్కు యాత్రికులకు పాస్ పోర్టు అవసరం లేదని, కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని ఇటీవల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చేసిన ప్రకటనతో పాక్ పదాతి దళం విబేధించింది. దరిమిలా పాక్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. సిక్కు యాత్రికులకు పాస్పోర్టు అవసరమా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని పాక్ను భారత్ కోరింది. దరిమిలా భారత సిక్కు యాత్రికులకు పాస్పోర్టు ఉండాల్సిం దేనని ఆ దేశ పదాతి దళపతి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ పేర్కొన్నట్లు పాక్ పత్రిక – డాన్ పత్రిక పేర్కొంది. ‘పాక్ భూభాగంలోకి వచ్చే ప్రతి ఒక్కరు న్యాయపరంగా రావాల్సిందే. భద్రతాపరమైన కారణాల రీత్యా పాస్పోర్టు ఆధారంగానే ఎవరినైనా దేశంలోకి అనుమతిస్తాం. దేశ భద్రత, సమగ్రత అంశం లో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని గఫూర్ అన్నారు.కర్తార్పూర్ మార్గాన్ని వచ్చే శనివారం ప్రారంభించ నున్నారు. పాక్లోని సరోవల్ జిల్లా గురు ద్వారా దర్బార్ సాహిబ్ను పంజాబ్లోని గురుదాస్పూర్లో ఉన్న డేరా బాబా నానక్తో ఈ నడవా అనుసంధానిస్తుంది. ఈ నడవా మీదుగా రోజుకు 5 వేల మంది యాత్రికులను అనుమతిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos