పుణె : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) డబుల్ సెంచరీ చేశాడు. 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె(59; 168బంతుల్లో 8×4)తో కలిసి నాలుగో వికెట్కు 178 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించాడు. రహానె అర్ధ శతకం తర్వాత మహారాజ్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(26; 66బంతుల్లో 2×4)తో కలిసిన కోహ్లీ మరో 107 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. ఈ ద్విశతకంతో కోహ్లీ ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా అందుకోవడం విశేషం. భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.