న్యూఢిల్లీ: లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని, ఆ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమండ్ చేశారు. ఈ మేరకు మంగళ వారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎటువంటి జాప్యం చేయకుండా ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 16వ లోక్సభ ప్రారంభం అయ్యే వరకు ప్రతి సభలోనూ డిప్యూటీ స్పీకర్ ఉన్నారని, విపక్షాల నుంచి డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం ఆనవాయితీ అని ఆ లేఖలో తెలిపారు. తొలిసారి ఆ పోస్టు రెండు పర్యాయాల నుంచి ఖాళీగా ఉంటోందని విమర్శించారు. ఇది భారతీయ ప్రజాస్వామ్యానికి శుభసంకేతం కాదు అని, రాజ్యాంగంలోని హక్కులను ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు.