కేజ్రీవాల్ విడుదలకు హైకోర్టు బ్రేక్

కేజ్రీవాల్ విడుదలకు హైకోర్టు బ్రేక్

న్యూ ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదలను హై కోర్టు అడ్డుకుంది. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బయటకు రావాల్సిన కేజ్రీవాల్ ను విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. గురువారం విచారణ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రవాల్ బెయిల్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయకూడదని తేల్చి చెప్పింది. దీంతో సాయంత్రం తమ అధినేత బయటకు వస్తారని సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు షాక్ తగిలినట్లైంది.
అంతకుముందు..
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో జైలుపాలైన కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. స్కాంలో కేజ్రీవాల్ పాత్ర ఉందనేందుకు సరైన ఆధారాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించలేకపోయిందని వ్యాఖ్యానిస్తూ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. దీనిపై ఈడీ తరఫున వాదిస్తున్న లాయర్ అభ్యంతరం చెబుతూ.. లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ కేజ్రీవాలేనని పేర్కొన్నారు. బెయిల్ మంజూరు ఆదేశాలను 48 గంటల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos