పాట్నా: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని
ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకుడు కన్నయ్య కుమార్కు వ్యతిరేకంగా బీహార్ భాజపా అల్పసంఖ్యాక వర్గాల నేతలు బెగుసరాయి జిల్లా కోర్టులో గురువారం
వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బెగుసరాయి లోక్సభ స్థానం నుంచి సీపీఐ తరఫున పోటీ
చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా స్థానిక అంజుమన్ ఇస్లామియా హాల్లో
సిపిఐ నిర్వహించిన సభలో సోమవారం ప్రసంగించారు. ‘ ప్రధాని మోదీని తీవ్రస్థాయిలో
విమర్శించారని. ఘర్షణలకు దారి తీసేలా ’కన్నయ్య మాట్లాడారని వ్యాజ్యంలో
వివరించారు.