కాల్పుల మోతలో కాబూల్

కాల్పుల మోతలో కాబూల్

కాబూల్: నగరం తుపాకీల కాల్పులతో మోగిపోతోంది. దీంతో మామూలు, వాణిజ్య విమానాల సంచారానికి అక్కడి గగనతలాన్ని మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. కేవలం సైనిక అవసరాల కోసమే విమానాల్ని వినియోగించు కోను న్నారు. దరిమిలా విదేశీ పౌరుల తరలింపునకు ఆటంకం ఏర్పడింది. అక్కడి భారత పౌరులను తీసుకొచ్చేందుకు సమాఖ్య ప్రభుత్వం రెండు విమానాలను కాబూల్ కు సోమవారం రాత్రి 8.30 గంటలకు పంపదలచారు. పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించి మధ్యాహ్నం 12.30 గంటల కల్లా కాబూల్ కు పంపించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆ రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. అమెరికా వెళ్లాల్సిన లేదా అక్కడి నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాలన్నింటినీ ఆఫ్ఘన్ గగనతలం మీది నుంచి కాకుండా దోహా మీదుగా మళ్లించినట్లు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. దోహా లో ఇంధనం నింపుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తాయని చెప్పాయి. షికాగో నుంచి వస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. వివిధ దేశాలు తమ పౌరులను తీసుకెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు విమానాలు చేరుకున్నా గగనతలాన్ని మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos