న్యూ ఢిల్లీ: గూఢచర్యం కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ వీడియోలు తీసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆ వీడియోలను పాక్ ఏజెంట్ల తో పంచుకున్నట్లు భావిస్తున్నారు. పాకిస్థాన్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా ను అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.