వీరపల్లి: సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను పాలకులు బద్ధకస్తులుగా మారుస్తున్నారని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా బావులపాడు మండలం వీరపల్లిలో విజయా డెయిరీ కొత్త యూనిట్ ను చిన్న జీయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వాలు పలు రాయితీలను ఇస్తుండటాన్ని తప్పుబట్టారు. కూర్చుంటే ఒకటి, నడిస్తే ఒకటి, పుడితే ఒకటి, నడిస్తే ఒకటి, తింటే ఒకటి, తినకపోతే ఒకటి, పడుకుంటే మరొకటి ఇలా ప్రతి దానికి రాయితీలు, ఉచితాలు ఇస్తూ ప్రజలను బలహీనులుగా, బద్ధకస్తులుగా చేస్తున్నారని అన్నారు. అన్నీ మనింటికే చేరుతుంటే ఇక పని చేయడం ఎందుకులే అనే ధోరణిలో ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు.