జల్లికట్టు ప్రారంభం.. బరిలోకి 600కిపైగా ఎద్దులు

జల్లికట్టు ప్రారంభం.. బరిలోకి 600కిపైగా ఎద్దులు

చెన్న: జల్లికట్టు క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తచ్చన్‌కురిచిలో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్‌, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి. సుమారు 300 మందికిపైగా యువకులు ఎద్దులను నిలవరిం చేందుకు పోటీపడ్డారు. జ‌ల్లిక‌ట్టు త‌మిళ‌నాడులో అనాదిగా వ‌స్తున్న ఆచారం. ప్రతి సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఉత్సవం జ‌రుపుకుంటారు. జ‌ల్లిక‌ట్టు అంటే ఎద్దుల‌ను, కోడెల‌ను బెద‌ర‌గొట్టి ఒక మార్గం గుండా గుంపులుగా వ‌దిలిపెడుతారు. గుంపులుగా ప‌రుగులు తీస్తున్న ఎద్దుల‌ను యువ‌కులు లొంగిదీసే ప్రయ‌త్నం చేస్తారు. అలా లొంగదీసిన వ్యక్తిని విజేతగా ప్రక‌టిస్తారు. జనవరి నుంచి మే 31 మధ్య సాధారణంగా 120కిపైగా జల్లికట్టు ఈవెంట్‌లు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ ఎద్దుల క్రీడలను చూసేందుకు తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos