అమరావతి: వైకాపా అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఈ నెల 16కు వాయిదా పడింది. బుధవారం ముహూర్తం దాటి పోయినందున నాయకత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఇడుపుల పాయలో నూరు మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర ప్రారంభిస్తారని వైకాపా వర్గాలు తెలిపాయి.