విశాఖ: దసరా నాటికి ఇక్కడకు తన కార్యాలయాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. దసరాకు ఒక రోజు ముందు, అక్టోబర్ 23న విశాఖలో క్యాంపు కార్యాలయం పూజకు ముహూర్తం బాగుంటుందన్నది ప్రతిపాదన. ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. విశాఖలో ఏర్పాట్లు ఓ కొలిక్కి రావడంపై సీఎం కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుందని తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.