అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మంగళవారం కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మంగళ వారం ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. కేసులు ఎక్కువగా వస్తున్నాయని నివేదికల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదే. ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. 90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలో జరుగుతున్నాయి. కొవిడ్ వస్తుంది, పోతుంది. ఇప్పటి పరిస్థితుల్లో కొవిడ్ తో కలిసి జీవించక తప్పద’ని పేర్కొన్నారు