జామ్నగర్ : క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆమె జామ్నగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇటీవల ఆమె బీజేపీలో చేరారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి ప్రస్తుతం బీజేపీ నాయకురాలు పూనమ్ మాదమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.