నెల్లూరు: షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగాన్ని రేపు(శుక్రవారం) ఉదయం 9.17 గంటలకు నింగిలోకి పంపిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈ ఓఎస్ -08 శాటిలైట్ పంపనున్నట్లు వివరించారు. ఈవోఎస్ -08 ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని స్పష్టం చేశారు. ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈరోజు అర్ధరాత్రి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు.