నాగ్పూర్: విదర్భ
వరుసగా రెండో ఏడాది ఇరానీ కప్ను చేజిక్కించుకుంది. రంజీ ట్రోఫీలో చాంపియన్గా నిలిచిన
జట్టు ఇరానీ కప్పు కోసం రెస్టాఫ్ ఇండియాతో తలపడుతుంది.
ఈ పోరులో ఆద్యంతం ఆకట్టుకున్న విదర్భ టైటిల్ను దక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియా నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విదర్భ ఆట నిలిచే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రా అయ్యింది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం ఆధారంగా విదర్భను విజేతగా ప్రకటించారు. ఆ
జట్టు తొలి ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా, రెస్టాఫ్ ఇండియా 330 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ, స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే వికెట్ను నష్టపోయింది. ఆ తరుణంలో సంజయ్ రఘనాథ్(42),
అథర్వా తైడే(72)లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆపై గణేశ్ సతీష్(87)
హాఫ్ సెంచరీతో ఆకట్టకోగా, మోహిత్ కాలే(37) ఫర్వాలేదనిపించాడు. విదర్భ ఐదో వికెట్గా గణేశ్ సతీష్ వికెట్ను కోల్పోయిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు సంధి చేసుకున్నారు. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో నిలిచిన విదర్భను విజేతగా ప్రకటించారు.
2018 ఇరానీకప్లో కూడా తొలి ఇన్నింగ్స్ ఆధారంగానే విదర్భ టైటిల్ను గెలవడం విశేషం.