ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

  • In Sports
  • October 11, 2019
  • 207 Views
ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

పుణె : కెప్టెన్ విరాట్ కోహ్లీ (254 నాటౌట్, 336 బంతుల్లో 33×4, 2×6) సరికొత్త రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన అత్యధిక స్కోరు 243ను అధిగమించాడు. సెనురాన్ ముత్తుసామి వేసిన 154.4వ బంతిని బౌండరీకి తరలించి టెస్టుల్లో అత్యధిక పరుగుల మైలురాయిని దాటాడు. భారత్‌కు సారథ్యం వహించిన అందరిలోనూ ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మరో ఆటగాడు రవీంద్ర జడేజా (91, 104 బంతుల్లో 8×4, 2×6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ముత్తుసామి వేసిన 156.3వ బంతిని ఆడిన జడేజా డిబ్రూన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వెంటనే కోహ్లీ 601/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అతడి సారథ్యంలో భారత్ 600 స్కోరు చేయడం ఇది పదోసారి.మరో వైపు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగానే ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ విరుచుకు పడ్డాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టాడు.18 పరుగులతో ఆతిథ్య జట్టు బ్యాటింగ్ కొనసాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos