భారీ స్కోరు దిశగా….

  • In Sports
  • October 10, 2019
  • 174 Views
భారీ స్కోరు దిశగా….

పుణె : మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఈ టెస్టులోనూ అదే జోరును కొనసాగించాడు. 195 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 108 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఈసారి 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. చతేశ్వర్ పుజారా 58 పరుగులు చేశాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు రబాడకే దక్కాయి. ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ 63, అజింక్య రహానే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos