34కి చేరిన నాటు సారా మృతులు.

34కి చేరిన నాటు సారా మృతులు.

కళ్లకురిచి: నాటు సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. అస్వస్థతకు గురైన మరో 60 మందికిపైగా కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, అదేవిధంగా చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్ దాస్ నేతృత్వంలో కమిటీని వేశారు. నాటు సారా అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కళ్ల కురిచి కలెక్టర్పై బదిలీ వేటు వేశారు. జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాను సస్పెండ్ చేశారు. వీరితోపాటు మరో 9 మందిని కూడా సస్పెండ్ చేశారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos