హత్రాస్‌లో రాహుల్‌ గాంధీ.. బాధిత కుటుంబాలకు పరామర్శ

హత్రాస్‌లో రాహుల్‌ గాంధీ.. బాధిత కుటుంబాలకు పరామర్శ

లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ దుర్ఘటనలో మచరణించినవారి కుటుంబాలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. ఈ నెల 2న హత్రాస్ జిల్లాలోని పూల్రాయ్ గ్రామంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం హత్రాస్లో పర్యటించిన రాహుల్.. బాధిత కుటుంబాలను ఓదార్చారు. అలీఘర్లోని పిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు, ఛోటే లాల్ కుమారుడు పంకజ్, ప్రేమవతి, ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతి దేవి కుటుంబాలను కలుసుకున్నారు. వారిని పరామర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos