బీజేపీ నేతల మాటల్లో విషయం లేదు. అంతా విషమే

సికింద్రాబాద్: ఇక్కడి పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘బీజేపీ నేతల మాటల్లో ఏమాత్రం విషయం లేదు. అంతా విషమే. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్య లు దారుణం. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా. నీళ్లు వచ్చాయో లేదో ఇక్కడి రైతులను అడిగితే చెబుతారు. అమిత్షా అవగాహన లేకుండా మీ స్థాయిని తగ్గించు కోవద్దు. నీళ్లు వచ్చాయనేందుకు తెలంగాణలో పెద్ద ఎత్తున పండిన పంటలే నిదర్శనం. తెలంగాణ నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. మరి నీళ్లు లేనిదే పంటలు ఎలా పండాయి? అంత ధాన్యం ఎలా కొన్నారు? దేశంలో పంజాబ్ తర్వాత ఎక్కువగా వరి పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని నీతి అయోగ్ చెప్పింది. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు సగటున 3శాతమే . తెలంగాణలో అది 10శాతమని గుర్తుంచుకోండి. అమిత్ షా బీజేపీ నేతలు తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును చదివినట్టు ఉన్నారు. నీళ్ల గురించి బీజేపీ వాళ్లను కాదు.. అసలైన రైతులను అడగండి చెప్తారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయించి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ది చెంది ఉండేది. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను సభలో ప్రధాన మంత్రి ప్రకటిస్తారని అనుకున్నాం. కానీ ఆ ఊసే ఎత్తలేదు. మోదీ కూడా సభలో అబద్ధాలు చెప్పార’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos