సాగు చట్టాలపై 2024 వరకు ఉద్యమం

సాగు చట్టాలపై 2024 వరకు ఉద్యమం

న్యూ ఢిల్లీ : ‘రైతుల డిమాండ్లు ఆమోదించకుంటే.. ఈ ఉద్యమం 2024 వరకు కొనసాగుతుంది’అని జై కిసాన్ ఉద్యమ నేత గుర్బాక్ష సింగ్ బర్నాలా కుండ బద్దలు కొట్టారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ” ఉచిత ఆఫర్లు ప్రకటిస్తూ ప్రైవేటు టెలికాం సంస్థలు ముందుగా మొత్తం మార్కెట్ను ఆక్రమించుకుని బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు మూతపడేందుకు దారి తీసినట్లుగానే.. వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు సంస్థలు వస్తున్నాయి. ఆ సంస్థలు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే.. ఇక్క డా అదే జరుగుతుంది. ముందుగా ఆయా కంపెనీలు రైతులను తమ ఉచ్చులోకి లాగుతాయి. ఆ తర్వాత దోచుకుంటాయి. కాంగ్రెస్ తర్వాత భాజపా కూడా మా ఉద్య మా న్ని కించపరిచే ప్రయత్నం చేస్తోంది. రైతుల డిమాండ్లు ఆమోదించకుంటే.. ఈ ఉద్యమం 2024 వరకు కొనసాగుతుంది’అని గుర్బక్ష్ సింగ్ బర్నాలా తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైలు రోకో చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఫలితం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos