మణిపుర్: విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాను తోటి సైనికులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 8 మంది గాయపడ్డారు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్లో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని ఇంఫాల్లోని రిమ్స్కు తరలించారు. నిందితుడు 120వ బెటాలియన్కు చెందిన హవల్దార్ సంజయ్ కుమార్గా అధికారులు గుర్తించారు.