న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన గోపాల్ ఇటాలియా ను ఇక్కడి పోలీసులు సరితా విహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గోపాల్ ఇటాలియా మాట్లాడారు. ‘ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ నన్ను జైలులో పెడతానని బెదిరించారు. జైలు తప్ప పటేల్ సామాజిక వర్గానికి మోదీ ప్రభుత్వం ఏమిచ్చిండి? పటీదార్లను బీజేపీ అసహ్యించుకుంటోంది. నేను సర్దార్ పటేల్ వారసుడిని. జైళ్లకు భయపడేది లేదు. నన్ను జైలులో పెట్టుకోవచ్చ’ని సవాలు చేశారు.