న్యూ ఢిల్లీ: వంట గ్యాస్ ధర శుక్రవారం మరోసారి పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.43 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. దీంతో 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.1,736కి చేరింది. ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు.