విశాఖ రాజధాని:గంటా స్వాగతం

విశాఖ పట్టణం: పాలనా రాజధానిగా విశాఖ పట్నాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చేసిన ప్రతిపాదనను తెదేపా నేత గంటా శ్రీనివాసరావు బుధవారం ట్విట్టర్లో స్వాగతించారు. సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణ య మని ప్రశంసించారు. ‘ రహదారి. రైలు, విమానాలు, సాగర రవాణా వ్యవస్థల్ని కలిగిన రాజధానిగా అందరి ఆశలు, ఆంక్ష లని నెరవేర్చే నగరంగా మారుతుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు సహకరించటానికి సిద్ధంగా ఉన్నార’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos