న్యూ ఢిల్లీ : నగర సరిహద్దులో రైతులు తమ ఆందోళనలను మంగళవారం ఉద్ధృతం చేశారు. గాజీపుర్ సరిహద్దు(దిల్లీ-గాజియాబాద్ రహదారి)ను పూర్తిగా దిగ్బంధించారు. రహదారుల రెండువైపులా ట్రాక్టర్లను అడ్డు పెట్టారు. రోడ్లకు అడ్డంగా రైతులు బైఠాయించారు. రాకపోకలను అడ్డుకోవడం వల్ల దిల్లీ నుంచి గాజీపుర్, గాజియాబాద్కు వెళ్లే మార్గంలో వాహనాల సంచారానికి అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలను నిజాముదీన్ ఖట్టా, అక్షర్దామ్, గాజిపుర్ చౌక్ రహదారులకు మళ్లిస్తున్నట్లు ఢిల్లీ ఔటర్ రేంజ్ ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ పోలీసు కమిషనరు అప్సరా బోప్రా తెలిపారు.