ఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఇటీవలే కొవిడ్ నియంత్రణ ఇలా చేయవచ్చంటూ కేంద్రానికి మన్మోహన్ పలు సూచనలు చేశారు. ఆ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
దేశంలో మహోగ్రరీతిలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ను అయిదు సూత్రాలతో కట్టడి చేయవచ్చని వివరించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని ప్రధానంగా పిలుపునిచ్చారు.